Satavahana Dynasty In Telugu – శాతవాహన రాజ్యం (క్రీ . పూ 220 – క్రీ . శ 225)

Satavahana Dynasty In Telugu – శాతవాహనుల గురించి అంశాలు తెలంగాణ ప్రాచీన చరిత్ర లో  చాలా ముఖ్యమైనది. వివిధ పోటీ పరీక్షల్లో కనీసం 5 నుంచి 6 మార్కులు వచ్చే అవకాశం ఉన్న చాప్టర్. ముఖ్యంగా ఆవిర్భావ విషయాలు, రాజులు & వారు వేయించిన శాసనాలు, వారి రాజకీయ వ్యవస్థ, వారి పరిపాలన పద్దతుల గురించి కచ్చితంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. 

తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశంగా  శాతవాహనులు ఖ్యాతి గడించారు. శాతవాహనులు పాలించిన ప్రాంతం – తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర

మనం ఈ ఆర్టికల్ లో శాతవాహనుల చరిత్ర ను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 

satavahana dynasty in telugu map
Satavahana Dynasty Map

శాతవాహన రాజ్యం లో ముఖ్యమైన అంశాలు

  • రాజ్య స్థాపన
  • ముఖ్య విషయాలు 
  • శాతవాహనులు ఆర్యుల లేక మౌర్యుల ?
  • శాతవాహనుల వర్ణం 
  • జన్మస్థల వివాదాలు 
  • శాతవాహన చరిత్రకు గల ఆధారాలు 
  •  శాతవాహనుల  రాజకీయ చరిత్ర – ముఖ్య రాజులు 
  • శాతవాహనుల పరిపాలన 
  • సామాజిక పరిస్థితులు 
  • వాస్తు శిల్పకళా 
  • చిత్ర లేఖనం 
  • తెలుగు భాష ఆవిర్భావం

శాతవాహన రాజ్యం గురించిన ముఖ్య విషయాలు 

  • మొదటి రాజధాని – కోటిలింగాల (జగిత్యాల జిల్లా పూర్వం కరీంనగర్ జిల్లా)
  • రెండవ రాజధాని – ప్రతిష్ఠానపురం (పైఠాన్)
  • మూడవ రాజధాని – ధాన్యకటకం 
  • మూలపురుషుడు – శాతవాహనుడు 
  • వంశ స్థాపకుడు – శ్రీముకుడు 
  • అధికార భాష – ప్రాకృతం 
  • శాసన భాష – ప్రాకృతం
  • రాజా లాంఛనం – సూర్యుడు 
  • వంశంలో గొప్పవాడు – గౌతమి పుత్ర శాతకర్ణి 
  • విదేశీ యాత్రికుడు – మొగస్తనీసు 

శాతవాహనులు ఆర్యుల లేక మౌర్యుల ?

  • BSL హనుమంతరావు ప్రకారం శాతవాహనులు ఆర్యులు 
  • RS శర్మ ప్రకారం శాతవాహనులు  ద్రావిడులు 

శాతవాహనుల వర్ణం 

  • పురాణాలు శాతవాహనుడు శ్రీముకుడు విశాల శుద్రుడు అని వర్ణించాయి. 
  • ప్రాచీన వాజ్మయంలో ప్రకారం వీరు శూద్రులు 
  • సోమదేవసూరి రాసిన కథాసరిస్స్థగారం ప్రకారం శాతవాహనులు శతుడు అనే యక్షునికి , బ్రాహ్మణ శ్రీ జన్మించినవారు శాతవాహనులు (యక్ష జాతివారు). 
  • నాసిక్ శాసనం లో గౌతమి బాలశ్రీ తనను తాను రాజెశ్నిపత్ని, క్షత్రియ పత్ని గా పేర్కొనడం వల్ల శాతవాహనులు క్షత్రియులు అని కొందరి వాదన. 
  • నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణుడు అని పేర్కొనడం వల్ల వీరు బ్రాహ్మణులు మరి కొందరి వాదన 
  • జనప్రభాసూరి యొక్క కల్ప ప్రదీప గ్రంథం ప్రకారం శాతవాహనులు బ్రహ్మణశ్రీ మరియు నాగరాజు  యొక్క సంతానం (నాగజాతి)
  • ద్వాత్రింశిక పుత్తాళిక గ్రంథం ప్రకారం శాతవాహనుడు అనే బ్రాహ్మణుడికి మరియు నాగశ్రీ కి జన్మించిన వారు శాతవాహనులు.

జన్మస్థల వివాదాలు 

కర్ణాటక వాదం 

  • V.S సూక్తంకార్ ప్రకారం వీరు కర్ణాటక బళ్లారి కి చెందిన వారు. ఎందుకంటే 3 వ పూలమావి మాఖ్యదోని శాసనం , పల్లవ శివస్కంధ యొక్క హిరహడగళ్ళ శాసనాలు ఇక్కడ దొరకడమే. 

విదర్భ వాదం 

V.V మిరాశీ ప్రక్రారం వీరు మహారాష్ట్ర లోని విదర్భ కి చెందిన వారు

మహారాష్ట్ర వాదం 

  • శాతవాహనులు మహారాష్ట్రకు చెందిన వారు అని ప్రకటించినది P.T శ్రీనివాస అయ్యంగార్ , కే.గోపాలాచారి , D.P సర్కార్
  • వీరి ప్రకారం శాతవాహనుల జన్మస్థలం మరియు రాజధాని ప్రతిష్ఠానపురం

కోస్తా ఆంధ్ర వాదం

  • శాతవాహనుల తొలి జన్మస్థలం ఆంధ్ర అని R.G బండాగార్ , V.A స్మిత్ , I.J RAPSON. వీరి సిద్ధాంతం ప్రకారం శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. 

తెలంగాణ వాదం

  • P.V పరబ్రహ్మశాస్త్రి ప్రకారం వీరి రాజధాని కోటిలింగాల మరియు నీరు తెలంగాణాకు చెందిన వారు అని  తెలిపారు.
  • కంభంపాటి సత్యనారాయణ ప్రకారం వీరి పరిపాలన మొదటగా తెలంగాణలో ప్రారంభం అయిన తర్వాత పశ్చిమ దక్షిణ విస్తరించింది. 
  • శాతవాహన నాణేలు మరియు శాసనాలు కోటిలింగాలలో దొరకడం వల్ల వారు తెలంగాణకు చెందిన వారు గా డా. ధర్మరాజా రెడ్డి నిరూపించాడు. 
  • జి. రాంబాబు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, B.N శాస్త్రి, శ్రీ రామ శర్మ వంటి వారు శాతవాహనులు తెలంగాణకు చెందిన వారుగా చెప్పారు. 

శాతవాహనుల  రాజకీయ చరిత్ర – ముఖ్య రాజులు 

Rulers of Satavahana Dynasty in Telugu

  • శ్రీముఖుడు 
  • కృష్ణుడు 
  • మొదటి శాతకర్ణి 
  • సంధస్తంబి 
  • రెండవ శాతకర్ణి 
  • కుంతల శాతకర్ణి 
  • మొదటి పూలమావి  
  • గౌరవ కృష్ణుడు 
  • హాలుడు 
  • గౌతమి పుత్ర శాతకర్ణి 
  • వశిష్ఠ పుత్ర పూలమావి 
  • వశిష్ఠ పుత్ర శివశ్రీ 
  • యజ్ఞ శ్రీ శాతకర్ణి 
  • 3 వ పూలమావి (ఇతను చివరివాడు)